సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరుపుకున్న “పుష్ప “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరిగిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు సుకుమార్ “పుష్ప” మూవీ ని రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ‘పుష్ప’ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని సమాచారం . నిర్మాతలలో ఒకరైన వై.రవిశంకర్ మాట్లాడుతూ.. ఎంతో స్పాన్ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమనీ , అందుకే హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్తో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించామనీ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: