కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. అశేష అభిమాన గణం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నిర్ధారణ కావడంతో సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళనకు గురిఅయ్యారు. కరోనా కై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకరి నుండి మరొకరి కి కరోనా సోకుతుంది. తాను తన ఫ్యామిలీ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామనీ , అభిమానులు ఆందోళన చెందవద్దనీ ఎన్టీఆర్ కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి సినిమాలపై ప్రశంసలు కురిపించడం, కరోనా బారిన పడిన వారి ఆరోగ్యం బాగు పడాలని ట్వీట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడగా, ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఇప్పుడు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాననీ , మీకు బలం చేకూరాలనీ , మీ కోసం ప్రార్థిస్తున్నాననీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు తో పాటు స్టార్ హీరోయిన్ రకుల్ , హీరో రామ్ కూడా ట్వీట్స్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: