ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం ఆడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారి కారణంగా 8 నెలల పాటు ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆక్సిజన్ , వ్యాక్సిన్ వంటివి అందుబాటులో లేక ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లుతున్న ప్రజలకు సినీ సెలబ్రిటీస్ ధైర్యం చెబుతూ , తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాని ప్రజలకు సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ను పెట్టారు. మబ్బులు తొలగిపోతాయనీ , మంచి రోజులు వస్తాయనీ , క్షేమంగా ఉండండనీ , ఒకరికి ఒకరు సాయంగా ఉండండనీ , ప్రజలకు ధైర్యం చెబుతూ మబ్బులు క్లియర్ అవుతున్న ఫోటో ను నాని సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: