అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇదిలాఉండగా ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను మార్చి 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ ఆవిషయాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ శశి కిరణ్ తిక్క తండ్రి సూర్యనారాయణ రెండు రోజుల క్రితమే తనువు చాలించడంతో ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. ముంబైలో కూడా టీజర్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు.. అయితే అక్కడ కోవిడ్ కేసులు ఎక్కువవుతుండటంతో టీజర్ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు.
#MajorTeaser release stands postponed due to unforeseen circumstances. A new date will be announced soon.#MajorOnJuly2#MajorTheFilm@AdiviSesh @SashiTikka @sobhitaD @saieemmanjrekar @urstrulyMahesh @GMBents @sonypicsindia @AplusSMovies @vivekkrishnani @sonypicsfilmsin pic.twitter.com/UnMYoR2eFE
— GMB Entertainment (@GMBents) March 25, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల `దబాంగ్ 3`బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: