ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఎప్పుడో వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సంస్థ అధినేత నాగ వంశీ నేడు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నాని నటించిన జెర్సీ సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జెర్సీ సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కింది. ఈసందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో తమ తరువాత సినిమా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ఏప్రిల్ చివరిలో కానీ.. మే మొదటి వారం నుండి కానీ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది అని తెలిపారు.
కాగా ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేశారని సమాచారం. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: