టాలీవుడ్ యంగ్ హీరోలు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వారిలో సందీప్ కిషన్ కూడా ఒకడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ తో డీసెంట్ హిట్ ను అందుకున్న సందీప్ కిషన్ వెంటనే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇక ఈసినిమా టైటిల్ ను ఐదుగురు డైరెక్టర్లతో రిలీజ్ చేయించనున్నారు. పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ ఇలా ఐదుగురు దర్శకులు కలిసి మార్చి 25వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Our Production no 5 with @sundeepkishan @actorSimha new title will be launched by @purijagan @harish2you @megopichand @dirbobby @ShivaNirvana on 25th March at 10:10AM
Title changed, not the fun & Entertainment🤘😁
#NehaShetty #GNageswaraReddy @konavenkat99 @MVVCinema_ pic.twitter.com/DEWQ4eppRO
— KonaFilmCorporation (@KonaFilmCorp) March 23, 2021
కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























