కీరవాణి తనయుడు మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా మరోసారి మరో డిఫరెంట్ స్టోరీతో శ్రీసింహా వస్తున్నాడనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 21వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా రానున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు రాజమౌళి కూడా మరో అతిథిగా వస్తున్నట్టు తెలుస్తుంది.
ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: