అందరి ఫ్యాన్స్ సంగతి ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మధ్య మంచి సర్ఫరైజ్ లే అందుతున్నాయి. ఒకప్పుడు ఒక అప్ డేట్ కోసం ఎదురుచూసే అభిమానులకు ఈ మధ్య అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ కుష్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాల దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒక డైరెక్టర్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెపుతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు నాగ్ అశ్విన్. ఇంతకీ నాగ్ అశ్విన్ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే.. గతంలో ‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే నాగ్ అశ్విన్ జనవరి 29 న ఈ సినిమాకు సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ను ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫిబ్రవరి 26 వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఫ్యాన్ ప్రభాస్-నాగ్ అశ్విన్ అప్డేట్ మరో పది రోజుల్లో రానుందని, ఆ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. అయితే దానికి నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ.. తనను క్షమించమని, ఈ నెల26కి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేమని, అది సరైన సమయం కాదంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. దీనితో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు.
Hi…very sorry but there won’t be an update on the 26th…pls excuse me…it’s not the correct time…
— Nag Ashwin (@nagashwin7) February 15, 2021
ఇక అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ సలార్ మూవీ షూట్ తర్వాత ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: