పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుండి మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వార్తల ప్రకారమే షూటింగ్ శుక్రవారం గోదావరిఖనిలో మొదలైంది. ఇందు కోసం గోదావరిఖని సమీపంలోని రామగుండం చేరుకుంది చిత్ర బృందం. అంతేకాదు హీరో ప్రభాస్ అక్కడి పోలీస్ అధికారిని కలిశారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గోదావరిఖనిలోని బొగ్గుగనిలో హీరో ప్రభాస్, శృతిహాసన్లపై ప్రశాంత్ నీల్ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. తదితరుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: