దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వం.. అందులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు నటిస్తుండటం.. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం ఇక ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు రాజమౌళి. అక్టోబర్ 13 న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు రాజమౌళి తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు సంగతేంటంటే.. అజయ్ దేవగన్ హీరోగా ఫుట్బాల్ లెజెండ్ అబ్దుల్ రహిం జీవిత కథ ఆధారంగా మైదాన్ అనే సినిమా తెరకెక్కుతుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో నేను అప్ సెట్ అయ్యాను.. రాజమౌళి నిర్ణయం పూర్తిగా అనైతికంగా ఉంది.. మేము ఆరు నెలల క్రితమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరం కలిసి ఇండస్ట్రీని కాపాడుకోవాలి.. ఈ రెండు సినిమాల క్లాష్ వల్ల రెండు సినిమాలు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. మరి చూద్దాం ఇద్దరిలో ఎవరైనా తమ రిలీజ్ డేట్ ను మార్చుకుంటారేమో..
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: