అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే సమ్మర్ రేసులో పలు సినిమాలు ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరిపోయింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అంతేకాదు ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంట్లో కాదు థియేటర్స్ లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం.#JathiRatnalu March 11th Release.https://t.co/hn9S3vCMYY#జాతిరత్నాలు @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul #AnudeepKV #Radhan #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic #JathiRatnaluOnMar11 pic.twitter.com/HmZX0oJbZX
— Swapna Cinema (@SwapnaCinema) January 24, 2021
ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: