స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , 2 తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మరో బాలీవుడ్ మూవీ లో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన రకుల్ కరోనా నుండి కోలుకుని తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగన్ ఫిల్మ్స్ బ్యానర్ పై అజయ్ దేవగన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , రకుల్ జంటగా రూపొందుతున్న “మేడే ” మూవీ షూటింగ్ డిసెంబర్ 11 వ తేదీ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మేడే ” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ లో అజయ్ దేవగన్ పైలట్ , రకుల్ కో పైలట్ గా నటిస్తున్నారు. రకుల్ ఇప్పుడు “మేడే ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. తమ అభిమాన కథానాయిక రకుల్ కు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ దేవగన్ , రకుల్ జంటగా రూపొందిన బాలీవుడ్ మూవీ “దే దే ప్యార్ దే “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: