టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హీరో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందే “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పి ఎస్ వి పి పిక్చర్స్ , జి బి ఎ మీడియా బ్యానర్స్ పై శంతను బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా పీరియాడికల్ స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “హిందీ మూవీ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది . ఈ మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. హీరోయిన్ రష్మిక మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు. వికాస్ భట్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఒక హిందీ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో రష్మిక , అమితాబ్ కు కూతురి పాత్రకై ఎంపిక అయ్యారు. ఈ రెండు చిత్రాలతో రష్మిక బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: