ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ సినిమా నుంచి న్యూ ఇయర్ లేదా సంక్రాతికి ఏదైనా అప్డేడ్ ఉందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. సంక్రాంతి తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుందని.. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోందని నాగ్ అశ్విన్ చెప్పాడు.

ఇక బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























