‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ లాంటి హిట్ సినిమాల్లో తన నటనతో మెప్పించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు రాశీ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు కూడా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా తన పుట్టిన రోజు సందర్భంగా రాశీ మొక్కలు నాటి ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు తనబర్త్ డే రోజు మొక్కలు నాటడం చాలా హ్యాపీ ఉందని.. మన భూమిని మనం కాపాడటం అనేది మన బాధ్యత అని తెలిపింది.
View this post on Instagram
View this post on Instagram
ఇక తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగా ఉన్న రాశీఖన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో మూడు సినిమాలతో బిజీ గా ఉంది. సుందర్ సి దర్శకత్వంలో ‘అరణ్మనై-3’తో పాటు సూర్య ‘అరువా’ చిత్రంలోనటిస్తున్నారు. అలాగే మేధావి చిత్రంలో జీవాకు జంటగా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: