స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “, రవితేజ “క్రాక్ “, విజయ్ సేతుపతి “లాభం “(తమిళ ) మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 15. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో కరోనా మహమ్మారి భయం నుండి సినీ తారలు తగు జాగ్రత్తలతో షూటింగ్స్ లో పాల్గొనడానికై విమాన ప్రయాణాలు చేస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీస్ పీపీఈ కిట్స్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇప్పుడు శృతి పీపీఈ కిట్ ధరించి ప్రయాణానికి సిద్ధం అయ్యారు. ఆ ఫొటో ను శృతి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: