ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం కంగనా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక జయలలిత పాత్రలాగా కాస్త లావుగా కనిపించడం కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగిందట. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన కంగనా..తలైవి కోసం నేను 20 కిలోల బరువు పెరిగాను. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఇక నా పాత లుక్ లో మారాల్సి ఉంది. అప్పటి లుక్, చురుకుదనం, మెటాబాలిజాన్ని అలవాటు చేసుకోవాలి. వేకువ జామునే నిద్రలేస్తున్నా..జాగింగ్, వాకింగ్ కు వెళ్తున్నా. నాతో ఎవరెవరున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది కంగనా.
I had gained 20kgs for Thalaivi, now that we are very close to completing it, need to go back to my earlier size, agility, metabolism and flexibility. Waking up early and going for a jog/walk …. who all are with me ? 🙂 pic.twitter.com/4HP6jSRGq5
— Kangana Ranaut (@KanganaTeam) October 14, 2020
కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: