మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు…షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు పెళ్లి హడావుడి, కరోనా వల్ల షూట్ కు బ్రేక్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ను షురూ చేసాడు. ఈ నేపథ్యంలో నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్నిసితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. సెట్స్ లో ఉన్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే షూట్ చేస్తున్నామని తెలియచేసారు.
We are happy to inform that with all the safety precautions we have resumed shooting for our movie, #RangDe! See you all this SANKRANTHI ☺️
Always #WearAMask & Stay Safe!@actor_nithiin @KeerthyOfficial @pcsreeram @ThisIsDSP @actorbrahmaji @dirvenky_atluri @SVR4446 @vamsi84 pic.twitter.com/x4Ti8cRK40
— Sithara Entertainments (@SitharaEnts) September 23, 2020
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా భీష్మ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమా కూడా లైన్ లో వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: