మాయాబజార్ ‘సీత’ కన్నుమూత

Yesteryear Tollywood Actress Sita Passes Away

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎంతో మంది లెజెండ్రీ నటీనటులను కోల్పోగా ఇప్పుడు అలనాటి హీరో నాగభూషణం సతీమణి.. మాయాబజార్ సీత కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కోద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె నేడు హైదరాబాద్ లో కన్ను మూసారు. ఇక సీతమ్మ మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. నేడు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. ఆ తర్వాత ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్‌’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి సీతను ప్రోత్సహించారు కేవీ రెడ్డి. తన సినీ ప్రయాణంలో దాదాపు 250 చిత్రాల్లో నటించారు. అంతేకాదు ‘రుతురాగాలు’ సహా పలు టీవీ సీరియల్స్‌లో కూడా సీత నటించారు. నాటక రంగంలో నటుడు నాగభూషణంతో కలసి అనేక నాటకాల్లో నటించడంతో మనసులు కలవడంతో 1956లో నాగభూషణం సీతను పెళ్లి చేసుకొన్నారు. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. భువనేశ్వరి, నరేందర్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eight =