పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. ఇటీవలే పవన్ బర్త్డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. ‘వకీల్సాబ్’ షూటింగ్ పూర్తి కాగానే పవన్, క్రిష్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు క్రిష్-పవన్ సినిమాపై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. దానికి కారణం క్రిష్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్. క్రిష్ తన ఇన్స్టాలో రైటర్ సాయిమాధవ్ బుర్రా రాసిన అంతర్వాహిని అనే కవితను పోస్ట్ చేశారు. దీనితో ఇప్పుడు పవన్ సినిమాకు ఇదే టైటిల్ ను పెట్టనున్నారా అన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఇప్పటివరకూ విరూపాక్ష, బందిపోటు, గజదొంగ, ఓం శివమ్ టైటిల్స్ వినపడగా ఇప్పుడు ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్ కూడా చేరిపోయింది. మరి క్రిష్ ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని టైటిల్స్ వస్తాయో చూద్దాం.
కాగా ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృందం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: