పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలన్న నేపథ్యంలో ఆయన ఫ్లెక్సీ కడుతూ అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఘటన అటు అభిమానుల్లోనూ.. మెగా ఫ్యామిలీకి విషాదాన్ని మిగిల్చింది. ఇంకా పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. అంతేకాదు మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రామ్ చరణ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తన ట్వీట్లో తెలిపారు. మరణించిన వారిని తిరిగి తీసుకురాలేము. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలని ఆదుకునేందుకు నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను అని చరణ్ పేర్కొన్నారు.
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020
అల్లు అర్జున్ కూడా ఈ ప్రమాధంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరణించిన వారికి సంతాపం తెలియజేసిన బన్నీ, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమపై చూపిస్తున్న ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
My Deep condolences . pic.twitter.com/3EN4Tri4za
— Allu Arjun (@alluarjun) September 2, 2020
పవన్ 27వ సినిమా నిర్మాతలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.
Our deepest condolences! 🙏 pic.twitter.com/CfdINTQuNQ
— Mega Surya Production (@MegaSuryaProd) September 2, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: