చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు లవ్ స్టోరీ షూటింగ్ కూడా జరపుకుంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య – టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి ‘లవ్ స్టోరీ’ సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘నాగేశ్వరరావ్’ చేయవలసి వుంది. కానీ పరశురామ్ .. మహేశ్ బాబు ప్రాజెక్టుపైకి వెళ్లడంతో, ‘నాగేశ్వరరావ్’ సెట్స్ పైకి వెళ్లడానికి టైం పట్టేలా ఉంది. ఇక ఈ గ్యాప్ లో చై విక్రమ్ సినిమాను లైన్ లో పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని ఫిక్స్ చేసినట్టుగా కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మాత్రమే నటిస్తుందని.. చైతు సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రమే అని అంటున్నారు.
ఇంకా తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: