సూపర్ హిట్ “ప్రతిఘటన” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన Dr రాజశేఖర్ పలు మూవీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించారు. యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజశేఖర్ హీరోగా రూపొందిన “ఆహుతి “, అంకుశం “, మగాడు “, “అల్లరి ప్రియుడు “, “అన్న”, “గోరింటాకు “,” PSV గరుడ వేగ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ ” PSV గరుడ వేగ” మూవీ తరువాత రాజశేఖర్ హీరోగా రూపొందిన “కల్కి ” మూవీ నిరాశపరిచింది. రాజశేఖర్ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్ నీలకంఠ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన “షో ” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నీలకంఠ నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన “మిస్సమ్మ “మూవీ 4 నంది అవార్డ్స్ , “విరోధి “మూవీ 2 నంది అవార్డ్స్ అందుకున్నాయి. నీలకంఠ దర్శకత్వం వహించిన సైకలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ “మాయ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నీలకంఠ , రాజశేఖర్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతుందనే వార్త అభిమానులను ఆనందపరచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: