లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ టైం లో తాను కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నా అంటున్నాడు సాయి తేజ్. నేను షూటింగ్స్ తో బిజీగా ఉంటా కాబట్టి రోజూ తాను ఇంట్లో ఏం చేస్తుందో చూసే ఛాన్స్ ఉండేది కాదు.. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లో ఉండటం వల్ల రియలైజ్ అయ్యాను మన తల్లులకు మనం గ్రాంటెడ్ గా ఉండాల్సిందే.. నేను తమ్ముడు వైష్ణవ్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టడమే పెద్ద పనిగా ఫీల్ అవుతాం.. కానీ తను మాత్రం ఇన్ని రోజుల నుండి ఎన్నో పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ ఏనాడూ మమ్మల్ని ఏం అనలేదు అని చెపుతున్నాడు. అంతేకాదు మా అమ్మకి కొంచం బ్రేక్ ఇచ్చి ఇంటి పనులు తామే చేయాలని కూడా నిర్ణయించుకున్నారట. క్లీనింగ్, కుకింగ్, గార్డెనింగ్, గిన్నెలు శుభ్రంచేయడం, లాండ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఇంట్లో పనులు చేయడం కంటే షూటింగ్స్ లో యాక్షన్ సీక్వెన్స్ చేయడమే ఈజీ అని అంటున్నాడు తేజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా రావడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో సినిమాను లైన్ లో పెట్టాడు జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా సినిమా రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: