ప్రభాస్ జోడీగా దీపిక ఎంపిక పై కీర్తి సురేష్ స్పందన

Keerthy Suresh Shares Her Happiness As Prabhas and Deepika Padukone Pairing Up For The First Time For Prabhas 21

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ “#Prabhas 21” మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ అవకాశం మున్ముందు గొప్ప ప్రయాణానికి నాంది అని దీపిక
ఆనందంతో ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “ఓం శాంతి ఓం ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి దీపికా పడుకొనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా దీపిక పలు అవార్డ్స్ అందుకున్నారు. హీరో ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకొనే ఎంపిక కావడం తో బిజీ హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించారు. బ్రహ్మాండమైన వార్త ఇదని , మరో బ్లాక్ బస్టర్ మూవీ కి ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జతకలిసిందని , ఈ వెయిటింగ్ ను భరించలేకున్నా అంటూ కీర్తి సోషల్ మీడియా లో తన హర్షం వ్యక్తం చేశారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =