భారత్ , చైనా సరిహద్దు గల్వాన్ లోయ లో భారత , చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. భారత్ , చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో పలు మూవీస్ రూపొందనున్నాయి. మేజర్ రవి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా “బ్రిడ్జ్ ఆఫ్ గల్వాన్ ” మలయాళ మూవీ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్వంత బ్యానర్ లో ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యం లో మరో బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయ్యింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా ఒక ప్రేమకథా చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించనున్నారు. 1967 సంవత్సరంలో ఇండియా , చైనా యుద్ధ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ లో ఇప్పటి గల్వాన్ ఘర్షణ కూడా ఉంటుందని సమాచారం. నిర్మాత రసూల్ మాట్లాడుతూ .. బాబా హర్భజన్ సింగ్ అనే భారత సైనికుని దృష్టి కోణంలో ఈ కథ సాగుతుందని , సరిహద్దులోని తాజా పరిస్థితులు కూడా ఈ మూవీ లో ఆవిష్కరిస్తామని, భారత ఆర్మీ అధికారుల సలహాలు , సూచనలతో నిర్మిస్తానని , కరోనా పరిస్థితులు చక్క బడిన తరువాత షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: