మెగా స్టార్ చిరంజీవి చేసిన ఫోన్ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు బండ్ల గణేష్. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందారు. అయితే ఇప్పుడు కోలుకున్నాడనుకోండి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బండ్ల గణేష్ ఈ విషయంపై మాట్లాడుతూ ఈ విషయంపై మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ రావడంతో చాలా డిప్రెషన్కి వెళ్లానని.. ఒకానొక సమయంలో చచ్చిపోతానేమోనని చాలా భయమేసిందని చెప్పాడు. అలా భయపడుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నుండి ఫోన్ కాల్ వచ్చింది.. ఎలా ఉందని ఆరా తీసి నాకు ధైర్యాన్ని ఇచ్చారని.. ఆయన చేసిన కాల్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని గణేష్ స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం విదితమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: