మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ… తేజ సజ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు శివానీ పుట్టిన రోజు సందర్భంగా తన ఇంట్రడక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లో పక్కింటి అమ్మాయిలాగ కనిపిస్తుంది. చుడీదార్ ధరించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెలవంకను చూపిస్తోన్న ఆమె పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ఫోన్లో ఏవో వింటూ సరిగ్గా పాత్ర పేరు వెన్నెలకు తగ్గట్లుగా ఆమె కనిపిస్తున్నారు.
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యు.ఎస్.కు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎస్ ఒరిజినల్స్, మహాతేజ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ తారాగణం, ఇతర వివరాలను ఫస్ట్లుక్ పోస్టర్తో త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇదిలా ఉండగా శివానీ ఇప్పటికే ఇండస్ట్రీ కి పరిచయమై ఉండాలి. అప్పట్లో శివాని టూ స్టేట్స్ తెలుగు రీమేక్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. అడవిశేష్, శివానీ కాంబోలో ఫైనల్ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: