యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా కథానాయికలు కాగా , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న “RRR” మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సడలింపుతో రాష్ట్రప్రభుత్వాలు మూవీ షూటింగ్స్ కు అనుమతినిచ్చాయి. దర్శకుడు రాజమౌళి పూణె (మహారాష్ట్ర )ఫోర్ట్ లో షూటింగ్ కు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ ప్లాన్ మారిందని సమాచారం. నల్గొండ జిల్లా లో దేవరకొండ , భువన గిరి , రాచకొండ ఫోర్ట్ లు ఉన్న విషయం తెలిసిందే. ఒక ఫోర్ట్ లో హీరోలు లేకుండా మిగతా ఆర్టిస్ట్ లతో “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ జరగనుందని సమాచారం. ఇద్దరు స్టార్ హీరోలు , స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో స్టార్ హీరోయిన్ అలియా భట్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: