టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, రష్మిక కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమాతో మహేష్ ఫ్యామిలీ కి బాగానే దగ్గరైంది రష్మిక. ఈ నేపథ్యంలోనే మహేష్, నమ్రతలకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. ఫ్రెష్ అవకాడో, మామిడికాయ పచ్చడి పంపించి షాకిచ్చింది. ఇక ఇప్పుడు రష్మిక తమకు పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది నమ్రత. థ్యాంక్స్ రష్మిక కూర్గ్ నుండి మాకోసం పంపించావు.. ఈ లాక్ డౌన్ మాకు వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది.. హ్యాపీ మాన్సూన్ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా వల్ల లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితమైంది. అయితే సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో తన ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూనే ఉంది.
ఇక ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. “సుల్తాన్ “తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతుంది. వీటితో పాటు కన్నడ మూవీస్ లో కూడా నటిస్తుంది ఈ భామ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: