లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఇక థియేటర్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో ఆరు నెలల దాక కూడా సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో నిర్మాతలకు కూడా చాలా నష్టం వస్తుంది. పెద్ద సినిమాల బడ్జెట్ లను కూడా కోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ తారలు కూడా ముందుకొచ్చి తమ రెమ్యునరేషన్ను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కోసం సమంత తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నారట. ఇది తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో పాటు…కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు భారం కాకూడని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు ఈ చిత్రంలోని పాత్ర సమంతకు బాగా నచ్చేసిందట.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: