అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు భామ ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా తెరపై పద్దతిగా కనిపిస్తుండటంతో అవేవీ అంతగా కలసిరావడం లేదు. ”అమీతుమీ, అ!, అరవింద సమేత” లాంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో కూడా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కియారా అద్వాని చేసిన పాత్రలో ఈషా రెబ్బా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఈషా రెబ్బా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నేషనల్ గా ఎన్నో షో లు.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి… ఒక నటిగా నిరూపించుకోడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ ఇప్పుడు ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ కూడా వస్తున్నాయి.. వేరే భాషల్లో కూడా డబ్ అవుతున్నాయి.. అంతేకాదు హాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు ఇప్పుడు అని తెలిపింది. ఇక దీనితో ఈషా హాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ మీదే నడుస్తుంది. స్టార్ హీరో హీరోయిన్స్ సైతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా నిజంగానే అవకాశాలు వచ్చినా సర్ ప్రయిజ్ అవ్వాల్సిన పనిలేదు. మరి చూద్దాం ఈ తెలుగుభామకు హాలీవుడ్ నుండి అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: