గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మలయాళ మూవీ 2020 ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పలుకుబడి, ధనవంతుడైన ఎక్స్ హవాల్దార్ , సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు మధ్య జరిగిన పోరాటం నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ పలు భాషలలో రీమేక్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ రైట్స్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్వంతం చేసుకుంది. యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా మరో హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కథ లో మార్పులు , చేర్పులు , ఇద్దరు హీరోలను ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేస్తూ , కథ కు న్యాయం చేసే దర్శకుడి కై నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. దర్శకుడు ఫైనలైజ్ అయ్యి , స్క్రిప్ట్ లో మార్పులకు హీరోలు ఇంప్రెస్ అయిన తరువాత ఈ మూవీ అధికారిక ప్రకటన వెలువడనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























