లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ వల్ల ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా కో-రైటర్ పొన్ పార్తీబన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు. ఈ సినిమా యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించారంట. డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఆ సంఘటన ఆధారంగా కథను ప్రిపేర్ చేసి.. ఆ వ్యక్తిని డైరెక్టర్ గారు కలిశారని తెలిపారు. మరి ఈ స్టోరీ వెనుక వున్న ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే.. కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. మరి ఇటీవలే బిగిల్ సినిమాతో హిట్ కొట్టిన విజయ్.. ఈ సినిమాతో ఎంత హిట్ కొడతాడో చూడాలి…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: