‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’ తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమా… పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ప్రభాస్ తలుపు తడుతున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ కి ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు దర్శక నిర్మాతలు కూడా. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ ని ఈ విషయంపై అడుగగా.. ‘నిజమే .. నేను ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాను.. ఒక ఆర్టిస్ట్ గా నాకు సంతృప్తిని ఇచ్చే పాత్ర ఇది. ఇంతవరకూ నేను చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటి అవుతుంది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా వుంది” అంటూ చెప్పింది. అయితే మరోపక్క ప్రభాస్ కు తల్లిగా నటిస్తుందన్న వార్తలు కూడా అందుకున్నాయి. మరి ప్రభాస్ తల్లి పాత్రనా లేక వేరే ఏదైనా పాత్రనా తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: