యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ ఉగాదికి విడుదల కావాల్సింది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఈ లోపే.. రాజ్ తరుణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నూతన దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించబోతున్న ఈ సినిమాని నందకుమార్ నిర్మించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడీయన్గా దర్శనమివ్వనున్నాడని టాక్. రాజ్ తరుణ్ కెరీర్లో ఇదొక విభిన్న పాత్రగా నిలుస్తుందని వినికిడి. అంతేకాదు.. ఈ చిత్రంలో కథానాయకుడి తల్లి పాత్ర కూడా చాలా కీలకమట. ఈ క్రమంలోనే ఓ సీనియర్ యాక్ట్రస్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆ యాక్ట్రెస్కు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
మరి.. కొంతకాలంగా విజయాలకు దూరమైన రాజ్ తరుణ్.. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్తోనైనా సక్సెస్ ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: