ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. యువ సంగీత సంచలనం థమన్ స్వరపరచిన బాణీలన్నీ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా విడుదలకి ముందు “సామజవరగమన”, “రాములో రాములా” ఉర్రూతలూగిస్తే.. విడుదలయ్యాక “బుట్ట బొమ్మ” గీతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2020 ఫిబ్రవరి 25న ఈ పాటకి సంబంధించిన వీడియో సాంగ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా.. తాజాగా 150 మిలియన్ల క్లబ్లో చేరిపోయింది “బుట్ట బొమ్మ”. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన సతీమణితో కలిసి స్టెప్స్ వేయడం చూస్తే.. ఈ పాటకి ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థంచేసుకోవచ్చు.
మరి.. మున్ముందు “బుట్ట బొమ్మ” ఖాతాలో ఇంకెన్ని రికార్డులు వశమవుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: