మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో “పుష్ప ” మూవీ రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “పుష్ప ” మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా నటిస్తున్నారు. చిత్తూరు యాస భాష ను నేర్చుకున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు హీరోయిన్ రష్మిక చిత్తూరు యాస భాషను ప్రాక్టీస్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ రష్మిక కు డైలాగ్స్ పలకడంలో హెల్ప్ చేస్తున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయం పూర్తి అయినతరువాత “పుష్ప ” మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత అల్లు అర్జున్ నటించే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “పుష్ప ” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: