రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి వాళ్లు స్వతహాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బయట తిరగడం.. తినడం మానేశారు. ఇక థియేటర్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆఫీస్ లు అన్నీ మూత పడ్డాయి. ఇక సినీ పరిశ్రమ కూడా ఈ వైరస్ కు భయపడిపోయి ఎక్కడిక్కకడ షూటింగ్ లను మధ్యలోనే ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. రిలీజ్ సినిమాలను వాయిదా వేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి షూటింగులు, చిత్ర ప్రదర్శనలను మార్చి 21 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ పొడిగింపును మరికొన్ని రోజులవరకూ పొడిగించారు. కరోనా అంతకంతకు పెరుగుతుండడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా సినిమా షూటింగుల నిలిపివేత మార్చి 31 వరకు పొడిగిస్తూ.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం చాంబర్ కార్యవర్గం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొన్నిరోజుల్లో మరోసారి సమావేశమై పరిస్థితిపై తాజా సమీక్ష నిర్వహిస్తామని ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: