పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్`(2012)తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జోడీ.. ఆ తరువాత `కాటమరాయుడు`(2017)లోనూ అలరించారు. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత ఈ జంట మరోసారి జట్టుకట్టనుందని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`.. తెలుగులో `వకీల్ సాబ్` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. అతనికి జోడీగా అతిథి పాత్రలో శ్రుతి హాసన్ కనిపించనుందట. త్వరలోనే శ్రుతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, `వకీల్ సాబ్` వేసవి కానుకగా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది.
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రాజు – శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పిస్తున్నారు. యువ సంగీత సంచలనం థమన్ సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: