ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు దేవి. ఈ నేపథ్యంలో తాజాగా ‘తెలుగు ఫిలిం నగర్’ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇటీవల కాలంలో మహేష్ పలు సినిమాకు దేవి పని చేసాడు. మంచి బ్లాక్ బస్టర్ లు అందించాడు. దీనిలో భాగంగానే మహేష్ తన కెరీర్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది…మీరు స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది… కానీ మీరిద్దరూ కలిసి పని చేయడానికి ఇన్నేళ్లు ఎందుకు అని అడుగగా దానికి దేవి …నాకు ‘అతడు’ సినిమాకే అవకాశం వచ్చింది.. కానీ అప్పటికే అది మణిశర్మగారు డైరెక్టర్ చేస్తున్నారు..ఏదో సెట్ అవ్వక నన్ను అడిగారు కానీ నాకు అలా వేరే ఒకరు స్టార్ట్ చేసింది నేను తీసుకోను.. నాకు కొన్ని ఎథిక్స్ వున్నాయి.. మణిశర్మ గారు నేను చాలా క్లోజ్.. తను స్టార్ట్ చేసింది మళ్ళీ నేను తీసుకుంటే బావుండదని చెప్పాను. నిజానికి నాది కెరీర్ స్టార్టింగ్.. మహేష్ తో సినిమా అంటే అంత తేలికగా ఒదులుకోలేరు కానీ నాది అలాంటి మనస్తత్వం కాదు అందుకే వద్దన్నాను అని తెలిపాడు. అలానే ఇంద్ర సినిమా అప్పుడు కూడా మణిశర్మ గారు అబ్రాడ్ లో ఉన్నారు.. అప్పుడు కూడా ఒక సాంగ్ చేయమని అడిగారు. కానీ నేను ఆయన స్వయంగా నాకు చెప్పి చేయమంటే చేస్తాను అంతేకాని అలా నేను చేయనని చెప్పేశాను అని దేవి చెప్పాడు.
[custom_ad]
మరి ఏదిఏమైనా ‘అతడు’ సినిమాకు, ఇంద్ర సినిమాకు మణి ఇచ్చిన పాటలను మరిచిపోవడం కష్టమే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలకు మణి కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి ఉంటే ఏలా ఉండేదో తెలియదు కానీ.. వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: