యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాక్సర్ గా దర్శనమివ్వబోతున్నాడు విజయ్. ఇటీవలే పట్టాలెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సమర్పణలో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటించనుందని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ఈ `విజయ్ దేవరకొండ 10` కోసం తాజాగా ముంబైలో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దారని తెలిసింది. దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్పెషల్ సెట్ లో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. అంతేకాదు.. ఈ సెట్ సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని సమాచారం. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: