సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ది 21 ఏళ్ళ ప్రయాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వరకర్తగా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు బాణీలకు అందించారు. సింహభాగం ఘనవిజయాలను అందుకున్నారు. పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో నంబర్ వన్ మ్యూజిక్ కంపోజర్ గా ఒకటిన్నర దశాబ్దం పాటు అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ఈ ఏడాది దేవిశ్రీ ప్రసాద్ కి వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సంవత్సరంతో ఈ యువ సంగీత సంచలనం వంద చిత్రాలను పూర్తి చేసుకునే దిశగా ప్లానింగ్ జరుగుతోంది. ఆ మధ్య కింగ్ నాగార్జున `డమరుకం`(2012)తో 50 చిత్రాల మైలురాయిని చేరుకున్న డీఎస్పీ.. ఈ ఏడాది చివరలోపు తన వందో చిత్రంతో పలకరించే అవకాశముంది. ఇంతకీ.. ఆ స్పెషల్ మూవీ ఎవరితో ఉంటుందో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ రాక్ స్టార్ ఖాతాలో `ఉప్పెన`, `రంగ్ దే`, `గుడ్ లక్ సఖి`, అల్లు అర్జున్ 20తో పాటు పవన్ కళ్యాణ్ 28 ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: