ఒకటిన్నర దశాబ్దానికి పైగా కథానాయికగా రాణిస్తోంది కేరళకుట్టి నయనతార. మరీ ముఖ్యంగా.. తమిళనాట లేడీ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటోందీ టాలెంటెడ్ బ్యూటీ. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్న నయన్.. ప్రస్తుతం మరో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. `చంద్రముఖి`, `శివాజీ` (ప్రత్యేక గీతం), `కథానాయకుడు`, `దర్బార్` తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో నయనతార మరో సినిమాలో కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. `శౌర్యం` శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నయనతార లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ టాక్. కథను కీలక మలుపు తిప్పే ఈ పాత్రలో నయన్ నటన మరో స్థాయిలో ఉంటుందని ఇన్ సైడర్స్ ఇన్ ఫర్మేషన్. మరి.. అభినయానికి అవకాశమున్న ఈ భూమికలో నయనతార ఏ మేరకు రంజింపజేస్తుందో తెలియాలంటే ఈ ఏడాది ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: