నటసింహ బాలకృష్ణ, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇరువురు జట్టుకట్టారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సదరు చిత్రం… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుండగా.. అతనికి జోడీగా శ్రియ, నయనతార నటించబోతున్నారని సమాచారం. ఇదివరకు పలువురు కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరాఖరికి ఆ పాత్రలు శ్రియ, నయన్ చెంతకు చేరాయని తెలిసింది. `చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్`లో శ్రియ.. `సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా`లో నయన్.. బాలయ్యకి జంటగా నటించారు. కట్ చేస్తే… ఇప్పుడు కొత్త చిత్రం కోసం ఈ ఇద్దరూ నాలుగోసారి నటించనుండడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే నాయికల విషయంపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: