హిందీనాట ఘనవిజయం సాధించిన ఎమోషనల్ కోర్ట్ డ్రామా `పింక్` (అమితాబ్ బచ్చన్, తాప్సీ).. తమిళంలోనూ `నేర్ కొండ పార్ వై` (అజిత్, శ్రద్ధా శ్రీనాథ్) పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ సరికొత్త వెర్షన్ లో రూపొందుతోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ కోర్ట్ డ్రామా.. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. 20 రోజుల పాటు సాగే తొలి షెడ్యూల్ లో నివేదా థామస్, అంజలిపై కీలక దృశ్యాలను చిత్రీకరిస్తారని వినికిడి. ఇక ఫిబ్రవరి మూడోవారంలో పవన్ జాయిన్ అవుతారని.. తన షూటింగ్ పార్ట్ మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందని టాక్.
కాగా, మేలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వస్తుంది. `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: