గత ఏడాది ఘనవిజయం సాధించిన పరిమిత బడ్జెట్ చిత్రాల్లో `బ్రోచేవారెవరురా` ఒకటి. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, నివేదా పెతురాజ్ నాయికలుగా నటించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు. అయితే, ఈ సారి వేర్వేరు సినిమాల్లో.. కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ రోజు (జనవరి 9) జనం ముందుకొచ్చిన `దర్బార్`లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా నివేదా థామస్ నటిస్తే.. 12న రిలీజ్ కానున్న `అల వైకుంఠపురములో`లో ఓ కీలక పాత్రలో నివేదా పెతురాజ్ కనిపించనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… అటు నివేదా థామస్ కి, ఇటు నివేదా పెతురాజ్ కి తెలుగునాట ఇవే ఫస్ట్ సంక్రాంతి రిలీజెస్. మరి.. తొలిసారి ముగ్గుల పండక్కి మురిపిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీస్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: