మరో స్టార్ హీరో కు విలన్ గా అరవింద్ స్వామి..?

ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరపై ఒక ఊపు ఊపిన హీరోలు ఇప్పుడు రీ ఎంట్రీ లో విలన్ పాత్రల్లో తమ సత్తా చూపిస్తున్నారు. జగపతి బాబు, మాధవన్, వివేక్ ఒబెరాయ్ ఇంకా ఈ లిస్ట్ లో అరవింద్ స్వామి కూడా వున్నారు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. ఇక ధృవ సినిమాతో మంచి స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు అరవింద్ స్వామి. ఇప్పుడు మరో స్టార్ హీరోకు ఆయన విలన్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు శింబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో మొదట విలన్‌గా కన్నడ స్టార్ సుదీప్ చేస్తారనే టాక్ వినబడింది. అయితే పవర్ ఫుల్ గా సాగే ఈ పొలిటికల్ డ్రామాలో అరవింద్ స్వామి నటిస్తే బావుంటుందని చిత్ర యూనిట్ భావించి ఆయనను సంప్రదించారట. ఇక దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విలన్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇకపోతే అరవింద్ స్వామి, శింబులు గతంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘చెక్క చివంత వానం’ చిత్రంలో అన్నా తమ్ముళ్ళుగా నటించిన సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =