బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. గత ఏడాది మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించి డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది కానీ… డైరెక్టర్ ఎవరూ..మిగిలిన విషయాలు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో మంచు లక్ష్మీ వెబ్ సిరీస్ చేయబోతుందట. రాజకీయ నేపథ్యంతో కథను ప్లాన్ చేసినట్టు సమాచారం.
నిజానికి పెళ్లిచూపులు సినిమా ముందే మంచు లక్ష్మీ తరుణ్ ను సినిమా చేయమని అడిగిందట. తరుణ్ భాస్కర్ తీసిన షార్ట్ ఫిలిం సైన్మాని చూసిన మంచు లక్ష్మి తనతో ఓ చిత్రానికి పనిచేయాలని కొన్నేళ్ల క్రితమే కోరారట. ఆమెతో సినిమా తీసే క్రమంలో కొన్ని కారణాల వల్ల వారి ప్రాజెక్టు వాయిదా పడింది. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్ళీ టైమ్ కలిసొచ్చింది. పూర్తిగా రాజకీయ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్కు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: