వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. మరి ఇప్పటికీ కన్ఫ్యూజన్ వున్న ఈ సినిమా ప్రారంభంపై ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు అనుగుణంగా పవన్ తో షూట్ చేయాలని చూస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దిల్రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతమందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇంకో హీరోయిన్ గా మల్లేశం సినిమాలో నటించిన తెలుగమ్మాయి అనన్య ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మరి వీటన్నింటిపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. మరి తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: